పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఫ్యామిలీ మెంబర్

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్ తగిలింది. ..

Update: 2024-04-28 17:32 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీపై విరుచుకుపడే ఆయనకు ఫ్యామిలీ నుంచి ఎదురు దెబ్బ తగిలింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ప్రచారం చేస్తున్న పోసానికి ఆయన కుటుంబ సభ్యుల నుంచే ఒక ఓటు టీడీపీలోకి వెళ్లిపోయింది. పోసాని కృష్ణ మురళి సోదరుడి కుమారుడు పోసాని యోగేంద్రనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. యూకేలో ప్రముఖ వ్యాపారవేతగా ఉన్న యోగేంద్రనాథ్.. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు సమక్షంలో టీడీపీ జెండా కప్పుకున్నారు. అటు హైదరాబాద్‌లోనూ ఆయన వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబుపై యోగేంధ్రనాథ్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు అంటే ఒక విజన్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆశయాలు నచ్చే తాను టీడీపీలో చేరినట్లు తెలిపారు. చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని యోగేంద్రనాథ్ చెప్పారు. అయితే సీఎం జగన్ అంటే తనకు ఇష్టమని, చంద్రబాబును ఎవరూ నమ్మొద్దని చెప్పే పోసాని కృష్ణ మురళికి సొంత ఫ్యామిలీ మెంబరే షాక్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

Tags:    

Similar News