Tirumala Samacharam: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

శ్రీవారి సన్నిథి తిరుమల క్షేత్రంలో భక్తలు రద్దీ కాస్త తగ్గింది.

Update: 2024-04-29 03:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీవారి సన్నిథి తిరుమల క్షేత్రంలో భక్తలు రద్దీ కాస్త తగ్గింది. ఆదివారం శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి ఓ మోస్తారుగా జనం తరలివచ్చారు. ఈ మేరకు టెకెన్లు లేని భక్తులకు దర్శనానికి ఖచ్చితంగా 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ రానున్న రోజుల్లో విపరీతంగా పెరిగిందని టీటీడీ వర్గాలు తెలిపాయి. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శనివారం స్వామి వారిని 86,241 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 41,690 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News