పురంధేశ్వరి, డీకే అరుణకు బంపర్ ఆఫర్ 

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా. 8 మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది జాతీయ కార్యదర్శులతో కార్యవర్గం రూపొందింది. ఈ కార్యవర్గంలో తెలుగు మహిళా బీజేపీ నేతలకు కీలక పదవులు దక్కాయి. కొత్త కార్యవర్గంలో మురళీధర్ రావు, రాంమాధవ్ కి చోటు దక్కలేదు. తెలంగాణ నుండి ఇద్దరు నేతలకు అవకాశం వరించింది. జాతీయ కార్యవర్గంలో ఉపాధ్యాయురాలుగా డీకే అరుణ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా డా.కే. లక్ష్మణ్ ఛాన్స్ కొట్టేశారు. దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. జాతీయ కార్యదర్శిగా సత్య కుమార్ కు చోటు దక్కింది. కర్ణాటక యువ ఎంపీ తేజస్వీ సూర్యకు యువ […]

Update: 2020-09-26 07:11 GMT

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా. 8 మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది జాతీయ కార్యదర్శులతో కార్యవర్గం రూపొందింది. ఈ కార్యవర్గంలో తెలుగు మహిళా బీజేపీ నేతలకు కీలక పదవులు దక్కాయి. కొత్త కార్యవర్గంలో మురళీధర్ రావు, రాంమాధవ్ కి చోటు దక్కలేదు. తెలంగాణ నుండి ఇద్దరు నేతలకు అవకాశం వరించింది.

జాతీయ కార్యవర్గంలో ఉపాధ్యాయురాలుగా డీకే అరుణ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా డా.కే. లక్ష్మణ్ ఛాన్స్ కొట్టేశారు. దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. జాతీయ కార్యదర్శిగా సత్య కుమార్ కు చోటు దక్కింది. కర్ణాటక యువ ఎంపీ తేజస్వీ సూర్యకు యువ మోర్చా బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యవర్గ జాబితాలో చోటు దక్కించుకున్న వారికీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News