Tirumala Samacharam: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Update: 2024-05-26 05:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం, శ్రీవారిని దర్శించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. గత వారం రోజుల నుంచి తిరుమల వీధులు అన్ని భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. శనివారం స్వామి వారిని 83,866 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 44,479 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News