ధరలు తగ్గించినా.. కేంద్రాన్నే విమర్శించడం సరికాదు

దిశ, నిజామాబాద్ సిటీ: పెట్రోల్ ధరలపై అన్ని రాష్ట్రాలు తమ తమ వాటాలను తగ్గిస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ తగ్గించకపోగా, కేంద్రంపై ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచారెడ్డి ప్రవళిక మండిపడ్డారు. గురువారం కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తోన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బట్టను నోటి చుట్టూ కట్టుకొని జిల్లా కేంద్రంలోని సాయారెడ్డి పెట్రోల్ బంక్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మహిళా మోర్చా […]

Update: 2021-12-02 05:35 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: పెట్రోల్ ధరలపై అన్ని రాష్ట్రాలు తమ తమ వాటాలను తగ్గిస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ తగ్గించకపోగా, కేంద్రంపై ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచారెడ్డి ప్రవళిక మండిపడ్డారు. గురువారం కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తోన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బట్టను నోటి చుట్టూ కట్టుకొని జిల్లా కేంద్రంలోని సాయారెడ్డి పెట్రోల్ బంక్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మహిళా మోర్చా ఇన్‌చార్జి దన్ పాల్ సూర్యనారాయణ గుప్త, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి స్రవంతి రెడ్డి, సభ్యులు, కార్పొరేటర్లు నిరసనలో పాల్గొన్నారు.

Tags:    

Similar News