BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జమ్మికుంట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
దిశ, వెబ్డెస్క్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జమ్మికుంట పోలీసు స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. ఈ నెల 30న పాడి కౌశిక్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారనే ఫిర్యాదుతో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత సదయ్య ఫిర్యాదు మేరకు జమ్మింకుట పోలీసులు కేసు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.