మేం మీకు వ్యతిరేకం కాదు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని, పథకాల విషయంలో అందరరూ సమానమేనని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-02 06:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని, పథకాల విషయంలో అందరరూ సమానమేనని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని ఓ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ.. ట్రాక్టర్ నడుపుతున్న ఓ ముస్లిం వ్యక్తిని ఆప్యాయంగా పలకరించారు. ఆయన మాట్లాడుతూ.. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. మేము ప్రవేశపెట్టిన ఏ పథకంలోనైనా అందరినీ సమానంగా పరిగణిస్తామని చెప్పారు.

అది ఉచిత రేషన్ ఇచ్చినా, బ్యాంకు ఖాతాలు ఇచ్చినా, బాత్ రూంలు ఇచ్చినా అందరికీ సమానంగానే ఇచ్చామని, ఉత్తరప్రదేశ్‌లో 40 లక్షల మందికి ఇళ్లు ఇస్తే అందులో 31% ముస్లింలకు కేటాయించబడ్డాయని, అలాగే 20 వేల నుంచి 20 లక్షల వరకు అవసరమైన వారికి ముద్ర రుణాలు అందించబడ్డాయని అందులో కూడా 36% రుణాలు ముస్లింలకు ఇవ్వబడ్డాయని తెలియజేశారు. మేం వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ వాళ్లు మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటే బీజేపీ ముస్లింలను ఆదుకుంటుందని తెలిపారు. ఈ విషయాలు మీ మిత్రులకు కూడా చెప్పాలని, మోడీ మళ్లీ వస్తారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. 

Similar News