భూమా అఖిల ప్రియ విడుదల

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న భూమా అఖిల ప్రియ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. శుక్రవారం సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆమె శనివారం సాయంత్రం జైలు నుంచి బయటకొచ్చారు. హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో ప్రవీణ్ సోదరుల కిడ్నాప్‌ తతంగంలో అఖిల ప్రియ కీలక పాత్ర వహించారని ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇదే వ్యవహారంలో ఆమె […]

Update: 2021-01-23 07:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న భూమా అఖిల ప్రియ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. శుక్రవారం సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆమె శనివారం సాయంత్రం జైలు నుంచి బయటకొచ్చారు. హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో ప్రవీణ్ సోదరుల కిడ్నాప్‌ తతంగంలో అఖిల ప్రియ కీలక పాత్ర వహించారని ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇదే వ్యవహారంలో ఆమె భర్త భార్గవ్ రామ్‌, అతడి సోదరుడు చంద్రహాస్, అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌లపైన కూడా కేసు నమోదు అయింది. కానీ, వీరు పరారీలో ఉంటూనే ముందస్తు బెయిల్‌ దాఖలు చేయడంతో ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

Tags:    

Similar News