ఎమ్మెల్యే మృతి… విషాదంలో అధికార పార్టీ

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అధికార పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం 6:30 సమయంలో ప్రాణాలు విడిచారు. కడపలోని అరుణాచలం ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. కాగా సుబ్బయ్య మృతితో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అటు వైసీపీ శ్రేణుల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. కాగా వెంకట సుబ్బయ్య […]

Update: 2021-03-27 21:33 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అధికార పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం 6:30 సమయంలో ప్రాణాలు విడిచారు. కడపలోని అరుణాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. కాగా సుబ్బయ్య మృతితో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అటు వైసీపీ శ్రేణుల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. కాగా వెంకట సుబ్బయ్య తొలిసారి 2019లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

Tags:    

Similar News