Breaking: మంత్రి ఆదిమూలపు సురేశ్ నిరసన... ఉద్రిక్తత..!

ఎర్రగొండపాలెం బస్టాండ్ సెంటర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ..

Update: 2023-04-21 11:57 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎర్రగొండపాలెం బస్టాండ్ సెంటర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దళితులకు చంద్రబాబు, లోకేశ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ స్వయంగా నిరసనలో పాల్గొన్నారు. నల్ల బెలూన్లు ఎగురువేసి చంద్రబాబు, లోకేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితులకు క్షమాపణలు చెప్పకపోతే చంద్రబాబు రోడ్ షోను అడ్డుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేశ్ హెచ్చరించారు.

కాగా చంద్రబాబు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పర్యటించనున్నారు. రోడ్ షో నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రగంగించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు మంత్రి ఆదిమూలపు సురేశ్ సిద్ధం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబుకు భద్రత పెంచారు. 

ఇవి కూడా చదవండి: Breaking: ఉద్రిక్త పరిస్థితుల్లో చంద్రబాబు కీలక ప్రకటన.. దమ్ముంటే గెలవాలని మంత్రికి సవాల్

Tags:    

Similar News