బ్రేకింగ్: పదవ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే రిజల్ట్స్ విడుదల

ఏపీ పదవ తరగతి విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది.

Update: 2023-05-05 11:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పదవ తరగతి విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇటీవల ముగిసిన పదవ తరగతి పరీక్షల ఫలితాలను రేపు (శనివారం) విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్ష ఫలితాలను రిలీజ్ చేస్తారని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక, ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మొత్తం 6.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 

Also Read...

రేపే టెన్త్ రిజల్ట్స్.. ఉదయం 11 గంటలకు రిలీజ్ 

Tags:    

Similar News