Tragedy: తల్లి ఆత్మహత్య.. ఏడాది బాలుడు కన్నీరుమున్నీరు

అనంతపూర్ జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో గృహిణి మౌనిక ఆత్మహత్య చేసుకున్నారు...

Update: 2023-04-03 14:23 GMT

దిశ, కళ్యాణదుర్గం: అనంతపూర్ జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో గృహిణి మౌనిక ఆత్మహత్య చేసుకున్నారు.  కుటుంబ సమస్యలతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని  ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆమెకు ఏడాది వయసున్న బాలుడు చార్విక్ ఉన్నారు. తల్లి చనిపోయిందని తెలియక పాలకోసం బాలుడు గుక్కపట్టి ఏడుస్తున్నారు.   ఈ దృశ్యం చూసిన కుటుంబ సభ్యులందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News