Virat Anushka: ఎంజాయ్ చేస్తున్న క్రికెటర్ కోహ్లీ, అనుష్క శర్మ.. ఆ ఫోటోలు వైరల్

ప్రస్తుతం ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Update: 2024-05-12 09:41 GMT

 దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రొఫెషనల్ లైఫ్‌తోపాటు పర్సనల్ లైఫ్‌ కూడా ఇంపార్టెంట్, భార్యకు కూడా తన డేలో కొంత సమయాన్ని ఇవ్వాలి అని అనుకున్నారేమాగాని, అనుష్క శర్మతో కలిసి డిన్నర్‌ డేట్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి బెంగళూరులోని ఓ రెస్టారంట్‌కు వెళ్లారు. కాగా రెస్టారంట్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోల్లో ఇరువురు నలుపు రంగు దుస్తుల్లో దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


Similar News