పబ్‌లో తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి

చెన్నైలోని ఆల్వార్‌పేటలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ పబ్‌లో పైకప్పు కూలి అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

Update: 2024-03-28 16:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలోని ఆల్వార్‌పేటలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ పబ్‌లో పైకప్పు కూలి అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News