BREAKING: మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం.. కోళ్ల ఫారం గోడ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం

కోళ్ల ఫారం గోడ కూలి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

Update: 2024-05-07 14:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోళ్ల ఫారం గోడ కూలి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని రాయిలపూర్ వద్ద కోళ్ల ఫారం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఆ ధాటికి నిర్మాణంలో గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో గోడను నిర్మించేందుకు కూలి పనికి వచ్చిన ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులను ఏపీకి చెందిన వాసులు సుబ్రమణ్యం (45), మాదాస్ నాగు (35)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతున్నారు.   

Read More...

బీర్లు దొరక్క మద్యం ప్రియులు బేజారు.. సీసీ టీవీల్లో రికార్డయిన వైన్ షాప్ నిర్వాహకుల నిర్వాకం

Tags:    

Similar News