ఆటో కారు ఢీ.. ఏడేళ్ల బాలుడు మృతి...
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంఘటనలో బాలుడు మృతి
దిశ, జనగామ: జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంఘటనలో బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం పెంబర్తి వద్ద ఆటోను ఓ కారు ఢీ కొట్టింది.వెంటనే జనగాం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఏడేళ్ల బాలుడు ఈశ్వర్ మృతి చెందారు. తీవ్రగాయాలైన క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.ఈ ఘటన పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని పోలీసులు తెలిపారు