ఆటో కారు ఢీ.. ఏడేళ్ల బాలుడు మృతి...

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంఘటనలో బాలుడు మృతి

Update: 2024-03-27 12:24 GMT

దిశ, జనగామ: జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంఘటనలో బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం పెంబర్తి వద్ద ఆటోను ఓ కారు ఢీ కొట్టింది.వెంటనే జనగాం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఏడేళ్ల బాలుడు ఈశ్వర్ మృతి చెందారు. తీవ్రగాయాలైన క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.ఈ ఘటన పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని పోలీసులు తెలిపారు

Similar News