కన్నతండ్రిని అతి కిరాతకంగా పొడిచి చంపిన కొడుకు

తాగుడుకు బానిసైన ఓ కొడుకు కని పెంచిన తండ్రినే కడతేర్చిన ఘటన మండల పరిధిలోని హైమద్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-05-09 07:50 GMT

దిశ, దౌల్తాబాద్: తాగుడుకు బానిసైన ఓ కొడుకు కని పెంచిన తండ్రినే కడతేర్చిన ఘటన మండల పరిధిలోని హైమద్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పఠాన్ ఫారూఖ్(35) తాగుడుకు బానిసై తల్లిదండ్రులను తాగేందుకు డబ్బు ఇవ్వాలని నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి ఫారుక్ తాగేందుకు డబ్బు ఇవ్వమని వేధించడం మొదలుపెట్టాడు. అందుకు తండ్రి కోపంతో నిరాకరించగా వాగ్వాదానికి దిగాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఫారూఖ్ కత్తితో పొడిచాడు. తీవ్రగాయం కావడంతో ఫారుక్ తండ్రి వలీ ఖాన్ (60) అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీరామ్ ప్రేమ్‌దీప్ తెలిపారు. వలి ఖాన్ మృతి దేహాన్ని పంచనామా నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు.

Similar News