విషవాయువు పీల్చి నలుగురు మృతి

గుర్తు తెలియని విషవాయువు పీల్చడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన నలుగురు మృతి చెందారు.

Update: 2024-05-09 06:20 GMT

దిశ, వెబ్ డెస్క్: గుర్తు తెలియని విషవాయువు పీల్చడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన నలుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనకు గురించి తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే విచారణ జరపాలని.. ఈ ఘటనకు కారణాలేంటో తనకు తెలపాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషాద సంఘటన యూపీలోని చందౌలీ, న్యూ మహల్ ప్రాంతంలో 15 ఏళ్ల నాటి సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా విషవాయువు కారణంగా ముగ్గురు కూలీలు సహా నలుగురు వ్యక్తులు మరణించినట్లు తెలిపారు.

Similar News