గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి

మక్తల్ నియోజకవర్గంలో ఎడవల్లి గ్రామ శివారులో గురువారం

Update: 2024-03-28 11:22 GMT

దిశ,మక్తల్: మక్తల్ నియోజకవర్గంలో ఎడవల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున గూడ్సు ట్రైన్ ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే చనిపోయిన సంఘటన జరిగింది. ఉట్కూరు మండలంలోని ఎడవల్లి గ్రామ శివారులో తెల్లవారుజామున మద్యం మత్తులో రైలు పట్టాలు దాటుతుండగా రాయచూర్ నుండి హైదరాబాద్ వెళ్లే గూడ్సు ట్రైన్ ఢీ కొనడంతో డోలు దేవప్ప అనే వ్యక్తి చనిపోవడం జరిగిందని గ్రామస్తులు చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్టు సమాచారం.

Similar News