ఆ ఫొటోలతో గిన్నిస్‌ కెక్కిన చిత్తూరు యువకుడు

by  |
ఆ ఫొటోలతో గిన్నిస్‌ కెక్కిన చిత్తూరు యువకుడు
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా వి.కోట మండలం పాపాయపల్లి గ్రామానికి చెందిన ధనుంజయ్‌ గౌడ్ అనే యువకుడు గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించాడు. ఆగస్టు 15న కిలిమంజారో పర్వతం ఎక్కుతూ గంట వ్యవధిలోనే 995 ఫోటోలను అప్‌లోడ్ చేశాడు. దీంతో అత్యధిక ఫోటోలు పంపిన విజేతగా గిన్నిస్ బుక్ నమోదు చేసింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ రికార్డు సాధించానని, గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కడం గర్వంగా ఉందని యువకుడు చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed