రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. రహదారిపై బైఠాయించిన కుటుంబీకులు

by  |
nijamabad
X

దిశ, నిజామాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ స్వాగత తోరణం వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కంఠం సాయిలు(65) అనే వ్యక్తి ద్విచక్రవాహనంలో ఉదయం తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో 44 నంబర్ జాతీయ రహదారి దాటుతున్నతున్న సమయంలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది.

దీంతో సాయిలు అక్కడిక్కడే మృతి చెందినట్టుగా ఇన్చార్జ్ ఎస్ఐ పేర్కొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబీకులు గ్రామస్థులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకుని కారు యజమానిని కఠినంగా శిక్షించి తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ రహదారిపై బైఠాయించారు. పరిస్థితిని గమనించి, విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని కారు యజమాని తెలపడంతో గ్రామస్థులు కుటుంబీకులు శాంతించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఇన్ఛార్జి ఎస్సై బాల్సింగ్ తెలిపారు.


Next Story

Most Viewed