హైదరాబాద్‌లో రైతు సంఘాల భారీ ర్యాలీ

by  |
హైదరాబాద్‌లో రైతు సంఘాల భారీ ర్యాలీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో రైతులకు మద్దతుగా హైదరాబాద్‌లో రైతుసంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. మంగళవారం మధ్యాహ్నం సరూర్‌నగర్ నుంచి ఉప్పల్‌ రింగ్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ జరిగింది. ర్యాలీలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. వాహన ర్యాలీ జరిగే మార్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎల్బీనగర్‌ నుంచి ఉప్పల్ వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో వెళ్లేవారు, వరంగల్ నుంచి ఉప్పల్ రింగ్‌రోడ్డుకు చేరుకునేవారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఔటర్ రింగ్‌ రోడ్డు నుంచి పలు మార్గాల్లో పోలీసులు వాహనాలను మళ్లిస్తున్నారు.



Next Story