ఘోరం రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురు మృతి

by Disha Web Desk 18 |
ఘోరం రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురు మృతి
X

దిశ, ఏలూరు: ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు.వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా ఆచంట గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్లు రొక్కాల అభిరామ్(20), చదలవాడ ఆనంద్ కుమార్ బైక్‌పై మార్టేరు నుంచి ఆచంట కు శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరారు. పోడూరు మండలం పండితవిల్లూరు కు చెందిన రోజువారీ కూలీ చుక్కా దుర్గారావు(28) మరో వ్యక్తితో కలిసి మరో బైక్‌పై ఆచంట నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఆచంట మండలం నక్కల కాలువ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎలక్ట్రీషియన్లు ఆనంద్, అభిరామ్ అక్కడికక్కడే మృతి చెందగా, మూడో వ్యక్తి రోజువారీ కూలి దుర్గారావు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని ఆచంట ఆసుపత్రికి తరలించారు. ఆచంట సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed