- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హత్యనా.. ఆత్మహత్యనా..? అనుమానస్పదస్థితిలో యువకుడు మృతి!
దిశ, రాయికల్ : జగిత్యాల జిల్లాలో పూర్తిగా కాలిపోయిన యువకుడి మృతదేహం కలకలం సృష్టిస్తోంది. నిన్న మిస్సింగ్ అయిన యువకుడు నేడు అనుమానస్పదంగా శవమై కనిపించాడు. ఇది హత్యనా.. ఆత్మహత్యనా అని ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బుస కళ్యాణ్ రామ్ నిన్న మిస్సింగ్ అయ్యాడు. దీనిపై యువకుడి కుటుంబసభ్యులు గురువారం రాయికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా అనూహ్యంగా శుక్రవారం ఉదయం ఇటిక్యాల, రాయికల్ గ్రామాల మధ్య ఉన్న ఓ పాత ఫౌల్ట్రీ ఫామ్లో కళ్యాణ్ రామ్ పూర్తిగా కాలిపోయి శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న రాయికల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా, మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటి నుంచి అదృశ్యమైన యువకుడు ఎక్కడకు వెళ్లాడు..? పాడుబడిన కోళ్ల ఫాంకు ఎందుకు వెళ్లాడు..? తనే ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైన హత్య చేసి తగలపెట్టారా..? అనే సందేహాలు ఇటు గ్రామ ప్రజల్లో, అటు పోలీసుల్లోనూ కలుగుతున్నాయి. ఈ అనుమానస్పద మృతిపై పోలీసులు స్థానికులు, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. సాయంత్రం వరకు దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.