తప్పుడు ధ్రువపత్రాలతో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులు అరెస్టు

by Disha Web Desk 15 |
తప్పుడు ధ్రువపత్రాలతో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులు అరెస్టు
X

దిశ, మనోహరాబాద్ : తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఒక వ్యక్తికి చెందిన ప్లాటును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి మోసం చేసినందుకు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తూప్రాన్ సీఐ కృష్ణ, మనోహరాబాద్ ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన సత్యనారాయణ మూర్తికి మండలంలోని కూచరం గ్రామ శివారులో దుర్గా అనే వ్యక్తి పేరు మీద ఉన్న ఓపెన్ ప్లాటును రంగారెడ్డి జిల్లా కూకట్పల్లికి చెందిన వీరపనేని

మధుసూదన్ రావు, హైదరాబాద్ కు చెందిన వెంకటేశ్వర్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసి మోసం చేసినట్లు బాధితుడు ఫిబ్రవరి 13న ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపామన్నారు. గత పక్షం రోజుల క్రితం ఒక వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా మరో ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసినట్టు తెలిపారు.ఈ అక్రమ రిజిస్ట్రేషన్ లో మరి కొంతమంది ఉండగా వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు .

Next Story

Most Viewed