భార్య చేతిలో భర్త హతం.. నిందితురాలితో సహా ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

by Disha Web Desk 23 |
భార్య చేతిలో భర్త హతం..  నిందితురాలితో సహా ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
X

దిశ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్ కు చెందిన హేమంత్ భార్య చేతిలో హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం రోహితి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికురాలు గా పనిచేస్తుంది. తన భర్త హేమంత్ నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవ చేస్తుండడంతో భరించలేని భార్య గురువారం ఉదయం రోకలిబండతో కొట్టి చంపింది. అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ సాయి కిరణ్,నవీన్ ల సహాయంతో తన భర్తను మంచానికి కట్టేసి కొట్టారు. అనంతరం అతడి పై వేడి నీళ్లు పోశారు. బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ చనిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed