- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, లోకేశ్వరం: మతిస్థిమితం లేని మహిళ గత మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లగా ఆమె మృతదేహం సోమవారం చెరువులో లభ్యమైంది. ఎస్ ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన సుంకరి సాయవ్వ (45) గత కొద్ది నెలల క్రితం మతిస్థిమితం కోల్పోయింది. ఈనెల 6న ఉదయం ఇంటి నుంచి వెళ్లగా కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. చివరకు లోకేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చివరకు సోమవారం పుస్పూర్ ప్రాంతంలో గల చెరువులో మృతదేహం లభ్యం అయింది. ఆమె చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






