చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

by Disha Web Desk 15 |
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
X

దిశ, నిజాంపేట : చేపల వేటకు వెళ్లి ఊబిలో ఇరుక్కుని ఊపిరాడక వ్యక్తి మృతి చెందిన సంఘటన నస్కల్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నస్కల్ గ్రామానికి చెందిన నీరటి వెంకటేశ్ (40) అనే వ్యక్తి మధ్యాహ్నం సమయంలో చేపల వేట కోసం గ్రామ శివారులో గల చెక్ డ్యాం వద్దకు వెళ్లి వాగులో వలవేశాడు. అదే వల ప్రమోదవశత్తు కాలుకు తగిలి ఊబిలో పడిపోగా ఊపిరాడక మృతి చెందాడు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా చెక్ డ్యాంలో పడి ఉన్నట్లు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని భార్య నిరాటి కళావతి ఫిర్యాదు మేరకు కేరసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed