పేటీఎం, అమెజాన్ కేవైసీ పేరుతో ఘరానా మోసం

by  |
పేటీఎం, అమెజాన్ కేవైసీ పేరుతో ఘరానా మోసం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కరోనా కష్టకాలంలో చాలామంది వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారు. బయటకు వెళితే ఎక్కడ వైరస్ బారిన పడుతామో అనే భయమే ఆన్ లైన్ సేల్స్ పెరగడానికి కూడా ఓ ప్రధాన కారణం.. ఈ విషయం గమనించిన కేటుగాళ్లు పకడ్భందీ ప్లాన్ వేశారు.

పేటీఎం, అమెజాన్ కంపెనీ కస్టమర్ కేర్ తరఫున కాల్ చేస్తున్నామని ఆయా కంపెనీల వినియోగదారులతో నమ్మబలికారు. మీ కేవైసీ అకౌంట్ అప్ డేట్ చేయాలని లేనియెడల కొనుగోళ్లు, పేమెంట్స్ ఆగిపోతాయని పలువురిని నమ్మించారు. ఈ క్రమంలోనే వారి బుట్టలో పడిన వ్యక్తుల నుంచి సుమారు రూ. 7.75లక్షలు కాజేశారు. డబ్బులు పొగొట్టుకున్న బాధితులు వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించారు. అసలు విషయం చెప్పి తమకు న్యాయం చేయాలని పోలీసులు ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు.

Next Story

Most Viewed