- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కరోనా కష్టకాలంలో చాలామంది వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారు. బయటకు వెళితే ఎక్కడ వైరస్ బారిన పడుతామో అనే భయమే ఆన్ లైన్ సేల్స్ పెరగడానికి కూడా ఓ ప్రధాన కారణం.. ఈ విషయం గమనించిన కేటుగాళ్లు పకడ్భందీ ప్లాన్ వేశారు.
పేటీఎం, అమెజాన్ కంపెనీ కస్టమర్ కేర్ తరఫున కాల్ చేస్తున్నామని ఆయా కంపెనీల వినియోగదారులతో నమ్మబలికారు. మీ కేవైసీ అకౌంట్ అప్ డేట్ చేయాలని లేనియెడల కొనుగోళ్లు, పేమెంట్స్ ఆగిపోతాయని పలువురిని నమ్మించారు. ఈ క్రమంలోనే వారి బుట్టలో పడిన వ్యక్తుల నుంచి సుమారు రూ. 7.75లక్షలు కాజేశారు. డబ్బులు పొగొట్టుకున్న బాధితులు వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించారు. అసలు విషయం చెప్పి తమకు న్యాయం చేయాలని పోలీసులు ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు.
Next Story