100% వ్యాక్సినేషన్ ఏ మా లక్ష్యం..

by  |
100% వ్యాక్సినేషన్ ఏ మా లక్ష్యం..
X

దిశ, లింగాల: ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఏఎన్ఎం రాజీ బాయి అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని రామాలయం టెంపుల్ ఆవరణలో వైద్య సిబ్బంది, శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ క్యాంప్ నిర్వహించారు. మొదటి, రెండోవ డోస్ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 100% వ్యాక్సిన్ ఏ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని గ్రామాల్లో ప్రజలకు వ్యాక్సిన్ పై అపోహలు ఉన్నాయని వాటిని విడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి కె, లింగాల పీ హెచ్ సీ కో ఆర్డినేటర్ సురేష్, వాలంటీర్ మన్నన్, కవిత, ఆశా వర్కర్స్ ఇంద్రమ్మా, కల్పన, ప్రమీల, హరిత తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed