దుర్గ పూజలో అపశృతి.. దుండగుల కాల్పుల్లో ఒకరు మృతి, చిన్నారులకు గాయాలు

by  |
దుర్గ పూజలో అపశృతి.. దుండగుల కాల్పుల్లో ఒకరు మృతి, చిన్నారులకు గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : యూపీలోని అయోధ్యలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అయోధ్యలోని కోర్ఖానా ప్రాంతంలో దుర్గ పూజ పండల్‌లో నలుగురు యువకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మృతిచెందగా, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి దుర్గా పూజ పండల్‌లోకి నలుగురు యువకులు వాహనాలతో వచ్చి అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిని చిన్నారులను సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్టు అయోధ్య ఎస్పీ శైలేష్ పాండే తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు.


Next Story

Most Viewed