వాళ్లను బలి తీసుకుంటున్న హంతకుడు కేసీఆర్: షర్మిల

by  |
Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ ఎంపీగా కవిత ఒక్కసారి ఓడిపోతేనే కేసీఆర్ గుండె తల్లడిల్లిపోయిందని, అలాంటిది నిరుద్యోగులు చస్తుంటే ఎందుకు చలించడం లేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఒక్కసారి ఓడిపోయినందుకే బిడ్డకు రెండుసార్లు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టేందుకు చూస్తున్నారని శనివారం ట్వీట్ చేశారు. నోటిఫికేషన్స్ లేక, ఉద్యోగాలు రాక పురుగుల మందు తాగి రోజుకో నిరుద్యోగి చస్తున్నా, కేసీఆర్ లో చలనం లేకుండా పోయిందని మండిపడ్డారు.

కేవలం ఒక్క నెలలోనే ఆరుగురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా, నోటిఫికేషన్స్ ఇవ్వాలనే సోయి కేసీఆర్ కు లేకుండా పోయిందని మండిపడ్డారు. నిరుద్యోగులను బలితీసుకుంటున్న హంతకుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. ఇంకెంత మందిని బలితీసుకొంటే కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డలే బిడ్డలు కానీ, ఇతరుల బిడ్డల ప్రాణాలంటే లెక్కలేదా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.


Next Story

Most Viewed