పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య..

by  |
shrisha
X

దిశ, ఖానాపూర్ : పెంబి మండలంలోని ఇటిక్యాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుంచు శిరీష (18) ఆదివారం పురుగుల మందు తాగి మృతిచెందింది. ఈ ఘటనపై ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన సుంచు లస్మయ్య, నర్సవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.

అయితే, కూతురు శిరీష ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగడంతో గమనించిన స్థానికులు వెంటనే శిరీషను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శిరీష మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే యువతి ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed