పెషావర్ మసీదులో ఆత్మాహుతి దాడి.. 59 మంది మృతి (వీడియో)

by Disha Web Desk 12 |
పెషావర్ మసీదులో ఆత్మాహుతి దాడి.. 59 మంది మృతి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మ‌ృతుల సంఖ్య 59 మందికి చేరింది. అలాగే ఇంకా 100 మందికి పైగా గాయపడినట్లు పాక్ అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో అత్యధికంగా నమాజ్ కోసం వచ్చిన పోలీసులే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పోలీసులను టార్గెట్ గా చేసుకునే ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పాక్ జాతీయ మీడియా తెలుపుతుంది.

కాగా ఈ ప్రమాదంలో గాయపడిని క్షతగాత్రులను పెషావర్‌లోని లేడీ రీడింగ్ హాస్పిటల్‌లో చేర్పించారు. గాయపడిన వ్యక్తులను ఇప్పటికీ సదుపాయానికి తీసుకువస్తున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి ప్రతినిధి మహమ్మద్ అసిమ్ తెలిపారు. కాగా.. ఇది ఆత్మాహుతి దాడినా లేక మసీదులో బాంబు పెట్టారా అనేది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదని పాక్ పోలీసులు తెలుపుతున్నారు.


Next Story

Most Viewed