- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఖానాపుర్ : నర్సంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పార్టీకి మొదటి నుంచి సేవలందిస్తున్న వాళ్ళు ఆశావహ దృక్పథంతో వేచి చూస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు చోటు చేసుకోవడం నియోజక వర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఖానాపూర్ మండలంలోని రాగంపేట గ్రామ ఉప సర్పంచ్ మీసం రవీందర్ పార్టీ మారారు. మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో పదిమంది కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.
ఈ చేరికతో ఖానాపూర్ లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇంతకాలం నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి బయటపడుతోందని మండల వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ… అన్యాయాన్ని ఎదిరిస్తూ నిలుస్తున్న రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం, పార్టీలో ఆయన నింపుతున్న ఆత్మస్థైర్యాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. కారు జోరును హస్తంతో ఎదుర్కొంటామని, టీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా దొంతి మాధవ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, వెంకట ప్రసాద్, ముస్తఫా, అఖిల్ రెడ్డి, రాజు, చేరాలు తదితరులు పాల్గొన్నారు.