కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై రేవంత్ షాకింగ్ కామెంట్స్

by  |
revanth reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : కల్లాల్లో రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఢిల్లీలో సేద తీరుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు.

టీఆర్ఎస్, బీజేపీ పార్టీల చేతిలో రైతులు పావుగా మారుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు జరగక అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఫిక్సింగ్‌లో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్‌ యాత్రలతో రాష్ట్రానికి, రైతులకు ఒరిగేదేమీ లేదని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం వానాకాలం పంట కొనకుండా వచ్చే యాసంగి గురించి ఎందుకు పంచాయితీ చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రేవంత్‌ అన్నారు.


Next Story