- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కుత్బుల్లాపూర్ : రోడ్డు ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి చెందిన పైదమ్మ(45), కాళీకృష్ణ (22), శ్రీవల్లి (18)లు గత కొన్నేళ్ల కిందట నగర శివారులోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్ పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి వలస వచ్చారు. తల్లితో పాటు శ్రీవల్లి జీడిమెట్ల అపురూప కాలనీలోని ఓ కంపెనీలో పనిచేస్తుండగా.. కుమారుడు కాళీకృష్ణ దూలపల్లిలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.
రోజు మాదిరిగానే కుమారుడు విధులు ముగించుకొని తల్లి, అక్కను తీసుకుని దూలపల్లి మీదుగా స్కూటీ పై ఇంటికి వెళ్తున్నాడు. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్దకు వెళ్లగానే వెనక నుండి వేగంగా దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
- Tags
- medchal