- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మనోజ్ మృతి’
<p>దిశ, క్రైమ్ బ్యూరో: గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జర్నలిస్ట్ మనోజ్ మృతి చెందాడని, వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, వైద్య సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుని సోదరుడు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మనోజ్ సోదరుడు సాయికుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 3వ తేదిన తనకు, తమ్ముడు మనోజ్ కు కరోనా పాజిటివ్ రావడంతో.. అర్థరాత్రి 12 గంటలకు గాంధీ ఆస్పత్రికి వెళ్లామన్నారు. మరుసటి […]</p>
దిశ, క్రైమ్ బ్యూరో: గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జర్నలిస్ట్ మనోజ్ మృతి చెందాడని, వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, వైద్య సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుని సోదరుడు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మనోజ్ సోదరుడు సాయికుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 3వ తేదిన తనకు, తమ్ముడు మనోజ్ కు కరోనా పాజిటివ్ రావడంతో.. అర్థరాత్రి 12 గంటలకు గాంధీ ఆస్పత్రికి వెళ్లామన్నారు. మరుసటి రోజు మనోజ్కు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని అక్కడి వైద్య సిబ్బందికి చెప్పినా కూడా వైద్యులెవరూ స్పందించలేదని ఆరోపించారు. గాంధీలో చేరిన మాకు సరైన బెడ్ సౌకర్యం కల్పించలేదన్నారు. అత్యవసర సమయంలోనూ ఐసీయూలోకి మార్చేందుకు 3 గంటలకు పైగా సమయాన్ని తీసుకున్నారని తెలిపారు. ఆక్సిజన్ అవసరమైనా కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లోనే ఈ నెల 7వ తేదీన మరణించినట్టు చిలకలగూడ పోలీసుల నుంచి సమాచారం అందినట్టు తెలిపారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహిరించిన వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సాయికుమార్ డిమాండ్ చేశారు.






