మరో రికార్డు సృష్టించిన ఏపీ.. వ్యాక్సినేషన్ లో మన ప్లేస్ ఎంతంటే ?

by  |
మరో రికార్డు సృష్టించిన ఏపీ.. వ్యాక్సినేషన్ లో మన ప్లేస్ ఎంతంటే ?
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా టీకాల విషయంలో రాష్ట్రం మరో రికార్డ్ సృష్టించింది. ఏకంగా దేశంలోనే 5 వ స్థానంలో నిలిచింది. దేశంలో ఇప్పటి వరకూ 20.4 శాతం ప్రజలకు రెండు డోసులు అందించినట్టు నివేదికలు చెబుతున్నాయి. అత్యధిక టీకాలు వేసిన లిస్ట్ లో కేరళా మొదటి స్థానంలో ఉండగా, ఏపీ 5 వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 18 ఏళ్ల పై నిండిన వారి నుంచి 44 ఏళ్ల వయసు గల వారి వరకూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.47 కోట్ల మంది 18-44 ఏళ్ల వయసు వారు ఉన్నారు. అయితే వీరిలో 3 కోట్ల మందికి పైగా మొదటి డోసు తీసుకోగా, 1.66 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారు.


Next Story

Most Viewed