పుంగనూరు ఆవును 4.10 లక్షలకు కొన్న రాందేవ్ బాబా

by Disha Web Desk 17 |
పుంగనూరు ఆవును 4.10 లక్షలకు కొన్న రాందేవ్ బాబా
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పుంగనూరు జాతి ఆవులు చాలా ఫేమస్. ఈ ఆవులు ఎక్కువగా చిత్తూరు జిల్లాలో కనిపిస్తాయి. ఈ ఆవును గుంటూరు జిల్లాకు చెందిన ఓ పశువుల కాపరి పెంచుతున్నాడు. ఆవు ఎత్తు 30 అంగుళాలు ఉంటుంది. రాందేవ్ ఆశ్రమం నుంచి వచ్చిన ప్రతినిధులు అతని వద్దనుంచి 4.10 లక్షలు ఖర్చు చేసి ఆవును కొనుగోలు చేశారు. ఈ జాతి ఆవులను పెంచడానికి చాలా సులువుగా ఉంటుందని బాబా రాందేవ్ ప్రతినిధులు అన్నారు. ఈ ఆవును కొనుగోలు చేసే ముందు పశువు వైద్యాధికారి నాగిరెడ్డి వద్ద వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ జాతి వీర్యం తెనాలి ప్రభుత్వ పశు వైద్యశాలలో అందుబాటులో ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed