అనారోగ్యంతో మేడారం సమ్మక్క పూజారి మృతి

by Dishanational1 |
అనారోగ్యంతో మేడారం సమ్మక్క పూజారి మృతి
X

దిశ, ఏటూరునాగారం: తెలంగాణ రాష్ట్ర మహా కుంభమేళాగా పేరు గాంచిన మేడారం జాతర సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే సాంబయ్య గత కొంతకాలంగా వెన్నుముకకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా వారం నుండి వెన్నుముకకి సంబంధించిన వ్యాధి అధికం కావడంతో ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం మొరుమురు గ్రామానికి నాటు వైద్యం గురించి మంగళవారం వెళ్ళాడు. అక్కడ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెనువెంటనే బుధవారం తెల్లవారు జామున ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆసుపత్రి వద్దకి చేరుకోగానే తుదిశ్వాస విడిచారు. దీంతో మేడారం గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.


Next Story

Most Viewed