- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆహార ధాన్యాల ఉత్పత్తి సగానికి తగ్గింది: జెలెన్ స్కీ ట్వీట్..
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడుల కారణంగా ఈ ఏడాది దేశంలో పంట సాధారణ పరిమాణంలో సగానికి తగ్గిపోయిందని అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. 'ఈ సంవత్సరం ఉక్రేనియన్ పంట రెండు రెట్లు తక్కువగా ఉండే ప్రమాదం ఉంది. మా ప్రధాన లక్ష్యం. రష్యా దండయాత్ర వల్ల ప్రపంచ ఆహార సంక్షోభాన్ని నివారించడం. ఇప్పటికీ ధాన్యాన్ని ప్రత్యామ్నాయంగా పంపిణీ చేయడానికి మార్గాన్ని చూస్తున్నాం' అని పేర్కొన్నారు. ఉక్రెయిన్, నల్ల సముద్రపు నౌకాశ్రయాలపై రష్యా నావికా దిగ్బంధనం కారణంగా ధాన్యాల యొక్క కీలక ప్రపంచ సరఫరాదారు అయిన ఉక్రెయిన్, దాని ఉత్పత్తిని కొనుగోలుదారులకు అందజేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రష్యా మిలిటరీ దాడులు మరింత తీవ్రం చేసిన నేపథ్యంలో జెలెన్ స్కీ కీలక సూచనలు చేశారు. తూర్పు డొనెట్స్క్ ప్రాంతంలోని పౌరులు ఖాళీ చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే డొనెట్స్క్ ప్రాంతంలో తప్పనిసరి తరలింపు చేయాలని ఆదేశాలు ఇచ్చాయని తెలిపారు. ఇప్పటికే యుద్ధ భూమిలో చిక్కుకుపోయిన వేల సంఖ్యలో ప్రజలు, పిల్లలును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.