- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దోచుకునేందుకే మంత్రివర్గ విస్తరణ.. బాంబు పేల్చిన ఎమ్మెల్యే
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ కోతలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. చేతకాని సీఎం వల్లే రాష్ట్రంలో అంధకారం నెలకొందని ఆరోపించారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.16 వేల కోట్ల భారం వేశారంటూ మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు పెంచి కూడా పూర్తిస్థాయిలో విద్యుత్ అందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు కరెంట్ కోతలతో పెట్టుబడిదారులు పారిపోతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ధరల నియంత్రణ లేదు.. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించలేదు అని విమర్శించారు. మరోవైపు మంత్రివర్గం కూర్పుపైనా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తవారు దోచుకునేందుకే మంత్రివర్గ కూర్పు అంటూ చెప్పుకొచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి రూ.2 వేల నోట్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారంటూ బాంబు పేల్చారు. కనీస వసతులు ఏర్పాటు చేయకుండానే జిల్లాలను విభజించారంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు.