- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేవంత్ ఆపరేషన్ సక్సెస్.. కాంగ్రెస్ గూటికి మాజీ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు?
దిశ, తెలంగాణ బ్యూరో: అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ శ్రేణులపై ఫోకస్ చేస్తే.. ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారపక్షంపై కన్నేసింది. గులాబీ నేతలను టార్గెట్ చేస్తోంది. బీజేపీకి చెందిన కీలక నేతలు ఈటల రాజేందర్, పార్టీలో చేరుతున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ కు వస్తారంటూ బహిరంగంగానే ప్రచారం చేస్తున్న హస్తం నేతలు.. టీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలో ఉన్న వారు కూడా కొంతమంది విపక్షంలో చేరుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ మొత్తం బీజేపీని టార్గెట్ గా పెట్టుకుంటే.. ఇదే అదునుగా కాంగ్రెస్ అంచనా వేస్తోంది. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా కీలక నేతలు గులాబీ నేతలపై దృష్టి పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్లోని కార్పొరేటర్లను సైతం పార్టీకి తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలే జరుగుతున్నాయి. అంతేకాకుండా సిటీ శివారు నియోజకవర్గాలకు చెందిన వారు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
ఇటీవల పెరిగిన వలసలు
కాంగ్రెస్లోకి ఇటీవల చేరికలు పెరిగాయి. మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు హస్తం గూటికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డితో సహా పలువురు చేరారు. బీజేపీ నుంచి కూడా బోడ జనార్ధన్, టీఆర్ఎస్ కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ లో జోష్ పెంచాయి. అనంతరం ఖమ్మం జిల్లా నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో, మంచిర్యాల నుంచి ప్రేంసాగర్ రావు ఆధ్వర్యంలో వలసలు కొనసాగాయి. తాజాగా బడంగ్పేట మేయర్ పారిజాతా నర్సింహారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డితో భేటీ కూడా అయ్యారు. ముందుగా కాంగ్రెస్ నుంచి గెలిచిన పారిజాతను టీఆర్ఎస్ లోకి తీసుకుని మేయర్ చేశారు. మేయర్ పారిజాత మాత్రమే కాకుండా కొంతమంది కార్పొరేటర్లు కూడా వెంట వచ్చే అవకాశాలున్నాయి. మీర్పేట కార్పొరేషన్ మేయర్ కూడా త్వరలోనే కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీలపై ఫోకస్
టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలను కాంగ్రెస్ అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచి, రెండోసారి ఓడిపోయిన సదరు మాజీ ఎమ్మెల్యే.. తన కుమారుడితో సహా హస్తంలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డితో చర్చలు కూడా పూర్తయ్యాయి. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా.. ఓ మాజీ ఎమ్మెల్సీ కూడా హస్తానికి చిక్కారు. కొంతకాలం కిందటి వరకు ప్రగతిభవన్ లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీకి ఇటీవల టీఆర్ఎస్ పెద్దలతో గ్యాప్ వచ్చింది. అంతేకాకుండా ఓ కాంట్రాక్ట్ విషయంలో ఆయనను అధికారులు ఇరుకున పెడుతున్నా.. టీఆర్ఎస్ అధిష్టానం నుంచి స్పందన రావడం లేదు. వంద కోట్ల బిల్లు ఆగి ఏడాదిన్నర గడుస్తున్నా.. ఇప్పించడం లేదని సమాచారం. అంతేకాకుండా పనుల్లో నాణ్యత లేదని సదరు మాజీ ఎమ్మెల్సీపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నేతలకు టచ్ లోకి వచ్చారు. త్వరలోనే ఆయన కూడా పార్టీలో చేరుతారని భావిస్తున్నారు.
మరోవైపు కొల్లాపూర్ సెగ్మెంట్లో విభేదాలు రోడ్డెక్కాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అదును చూసి టీఆర్ఎస్ ను వీడుతారని పార్టీ అధిష్టానం కూడా భావిస్తోంది. కొల్లాపూర్ లో విభేదాలు రోడ్డెక్కిన తర్వాత ఆయన మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ కు వస్తే కనీసం ప్రగతిభవన్ గేటు కూడా దాటనీయలేదు. అక్కడ గంటల తరబడి ఎదురుచూసి వెనుదిరిగినట్లు పార్టీ వర్గాల్లో చర్చ. ఈ సమయాన్ని అందుకున్న రేవంత్ సన్నిహితులు జూపల్లితో చర్చలు పెట్టారు. తిరిగి సొంత గూటికి రావాలని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడించినట్లు సమాచారం. జూపల్లి ఇంకా ఏ పార్టీలో చేరుతారో స్పష్టత లేకున్నా.. కాంగ్రెస్ లోకే వస్తారని అంచనా వేస్తున్నారు.
టార్గెట్ టీఆర్ఎస్
ప్రస్తుతం టీఆర్ఎస్ ఏకైక లక్ష్యం బీజేపీపైనే పెట్టింది. ఇదే అదునుగా కాంగ్రెస్ ఆ పార్టీ నేతలను టార్గెట్ గా పెట్టుకుంది. విపక్షాల నుంచి అధికారపక్షంలోకి వెళ్లడం సాధారణమే అయినప్పటికీ.. తాజాగా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ లోకి అధికారంలో ఉన్న నేతలు వస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు అవకాశం కోసం చూస్తున్నవారి జాబితా పెరుగుతోంది. గ్రేటర్ తో పాటుగా కీలకమైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేవారున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.మరోవైపు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలపై కాంగ్రెస్ గురి పెట్టింది. సిట్టింగ్ లు ఉన్న నియోజకవర్గాల్లో టికెట్ మార్చడం కష్టమేనంటూ ప్రచారం చేస్తోంది. దీంతో ద్వితీయ శ్రేణి నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారిని తిరిగి తీసుకురానున్నారు.
టికెట్ హామీ
పార్టీలోకి వచ్చేవారికి కొన్నిచోట్ల టికెట్ ఇప్పిస్తామనే హామీ కూడా ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరికలు చేసిన విషయం విదితమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసమే కొంతమంది కాంగ్రెస్లోకి వస్తున్నట్లు గాంధీభవన్ లో ప్రచారం జరుగుతున్ననేపథ్యంలో పార్టీ సీనియర్లు దీనిపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ నేత భట్టి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. పార్టీలోకి టికెట్ కోసం వచ్చేవారు రావద్దనే సంకేతాలిచ్చారు. కానీ, టీపీసీసీ చీఫ్ నుంచి కొంతమందికి స్పష్టమైన హామీ ఇస్తున్నారని, అందుకే పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు.