టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ స్పెషల్ ఫోకస్..

by Disha Web Desk 19 |
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ స్పెషల్ ఫోకస్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్ మారనుంది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ శాఖ సమర్పించకపోవడంపై ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. దీనికి సంబంధించిన విచారణ సోమవారం జరగనుంది. ఈడీ పిటిషన్‌లో కీలక అంశాలను ప్రస్తావించింది. ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్ కెల్విన్‌‌కు చెందిన ల్యాప్ టాప్‌లో డ్రగ్స్ తీసుకున్న సినీ తారల వివరాలు ఉన్నాయని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సినీతారలు సహా మొత్తం 41 మందిని ఎక్సైజ్ శాఖ విచారించిందని వారి కాల్ రికార్డ్స్‌ను కూడా సమర్పించడం లేదని ఈడీ ఆరోపిస్తోంది. ఈడీ జరిపే విచారణలో ఎక్సైజ్ శాఖ డిజిటల్ రికార్డ్స్, వాంగ్మూలాలు, కాల్ రికార్డ్స్ ఇవ్వకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సీఎస్, ఎక్సైజ్ డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది.

Next Story