- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పాఠశాలలు సందర్శన కలెక్టర్.. వారంలో పనులు పూర్తి చేయాలని ఆదేశాలు..
దిశ, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ప్రజా పరిషత్ పాఠశాలను, ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ పాఠశాలను శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ బవేష్ మిశ్ర సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పాఠశాల మరమ్మత్తుల కొరకు నిధులు విడుదల అయ్యాయని తెలిపారు. కాబట్టి అభివృద్ధి పనులను పాఠశాల అభివృద్ధి కమిటీ, స్థానిక సర్పంచులు వెంటనే వారం రోజుల్లోగా వేగవంతంగా పూర్తి చేసి పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల ఆవరణలో డైనింగ్ హాల్, నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం సూరారం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణి భాయి, జడ్పీటీసీ గుడాల అరుణ, జడ్పీ సి ఈ ఓ శోభా రాణి, ఎంపీడీవో శంకర్ నాయక్, తహసీల్దార్ శ్రీనివాస్, మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాపు,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటీల చైర్మన్లు, పాల్గొన్నారు.