అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు: కలెక్టర్ హరీశ్

by Disha Web Desk 19 |
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు: కలెక్టర్ హరీశ్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ అక్రిడిటియేషన్ కార్డులు అందచేస్తామని జిల్లా కలెక్టర్, అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఎస్. హరీశ్ తెలిపారు. గురువారం జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ పలు తీర్మాణాలు చేసింది. ఈ మేరకు 2022 – 2024 రెండేళ్ళకు గాను కొత్తగా అక్రిడిటేషన్ల కోసం దరఖాస్తు సమర్పించేందుకు, జారీ చేసేందుకు ఆన్లైన్ ద్వారా ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించిన విషయం విధితమే. అందుకు అనుగుణంగా జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ తదితర మీడియా సంస్థలలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఆన్ లైన్ లో చేసుకొన్న దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా అర్హులకు విద్యార్హత సర్టిఫికెట్, అనుభవం కలిగిన సర్టిఫికెట్లను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆన్ లైన్ ద్వారా 851 దరఖాస్తులు వచ్చాయని.. జర్నలిస్టులు చేసుకున్న దరఖాస్తులలో అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయుటకు కమిటీ ఆమోదం తెలిపింది. అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలియజేయడంతో అక్రిడిటేషన్ ప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా పౌర సంబంధాల శాఖను కలెక్టర్ హరీశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అనంతరం జిల్లా పౌర సంబంధాల అధికారి(డీపీఆర్వో) కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. అక్రిడిటేషన్ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తునట్లు తెలిపారు. కమిటీ ఆమోదం తెలిపిన అక్రిడిటేషన్లను త్వరలోనే జారీ చేస్తామన్నారు.అ క్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోని వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలిస్తామన్నారు. అర్హత ఉన్న దరఖాస్తులను ఆమోదించి, సంబంధించిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీచేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు వి.రామారావు (నమస్తే తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్), కె. వెంకటేశ్వర్లు ,(సాక్షి అసిస్టెంట్ చీఫ్ రిపోర్టర్), మెరుగు చంద్రమోహన్ ( ప్రజాపక్షం రిపోర్టర్) ఎం.వెంకట్ రెడ్డి ( జనం సాక్షి రిపోర్టర్), సముద్రాల కిరణ్ ( స్వాతిముత్యం డైలీ రిపోర్టర్) బొమ్మ అమరేందర్ ( ఏవీ న్యూస్ ఛానెల్ హెడ్), జి.ముత్తయ్యగౌడ్, (టీఎస్–9 జర్నలిస్టు), కె.సాయిబాబా, (వెలుగు ఫొటోగ్రాఫర్) తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed