- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- లోక్సభ ఎన్నికలు-2024
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది ప్రయాణికులు దుర్మరణం
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: హిమాచల్ ప్రదేశ్లోని కులూలో ఘోర ప్రమాదం జరిగింది. సైంజ్ లోయలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి 20 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. షయిన్షార్ నుంచి సైంజ్ వైపు టూరిస్టులతో వస్తోన్న బస్సు జంగ్లా గ్రామ సమీపంలో లోయలో పడిపోయింది. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యల్లో ఇప్పటివరకు ఆరు మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం జరిగిన ప్రదేశం లోయ కావడంతో బాధితులను వెలికి తీయడం, ఆసుపత్రికి తరలించడం కష్టతరంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story