ఎన్నికలు ముగియగానే ఆపని మొదలుపెడతాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

by Disha Web Desk 13 |
ఎన్నికలు ముగియగానే ఆపని మొదలుపెడతాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో:100 రోజుల కాంగ్రెస్ పరిపాలన తనకు సంపూర్ణ సంతృప్తి ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు కావొస్తున్న నేపథ్యంలో ఇవాళ సీఎం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ మూడు నెలల పరిపాలనలో ప్రభుత్వానికి సహకరించిన తెలంగాణ సమాజానికి సహచర మంత్రులకు, ఉద్యోగులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో, ఆరు గ్యారెంటీల హామీలతో ఎన్నికల్లో ప్రజాతీర్పును కోరామన్నారు. ప్రజల ఆమోదంతో డిసెంబర్ 7న రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన మొదలైందని, ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నిమిషం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలనే తపనతోనే పని చేస్తున్నాం. పదేళ్లలో కేసీఆర్ వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారు. గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముడులు వేస్తే వాటన్నింటిన ఒక్కొక్కటిగా విప్పుతున్నామన్నారు. ఈ వందరోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని భావించడం లేదుని, ఇంకా పెండింగ్ లో ఉన్న హామీలు, పెండింగ్ సమస్యలను పరిష్కరించేలా పని చేస్తామ్ననారు. తెలంగాణ అభివృద్ధి కోసం 2050 పేరుతో ఓ మెగా మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే ఈ విషయంలో సంప్రదింపులు ప్రారంభిస్తామని ప్రకటించారు.


Next Story