చంచ‌ల్‌గూడ జైలుకు సంగెం త‌హ‌సీల్దార్‌

by Disha Web Desk |
చంచ‌ల్‌గూడ జైలుకు సంగెం త‌హ‌సీల్దార్‌
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : రైతు నుంచి రూ.40వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగెం త‌హ‌సీల్దార్ రాజేంద్రనాథ్‌ను శ‌నివారం చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు. శ‌నివారం ఉద‌యం రాజేంద్రనాథ్‌ను ఏసీబీ కోర్టులో ప్రవేశ‌పెట్టి అనంత‌రం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంత‌రం పోలీస్ అధికారులు చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు. సంగెం త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయేంత వ‌ర‌కు రికార్డుల త‌నిఖీలు కొన‌సాగాయి. కొన్ని ముఖ్యమైన రికార్డుల‌ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంత‌కు ముందు త‌హసీల్దార్ ఇంట్లో జ‌రిగిన త‌నిఖీల్లో కొన్ని కీల‌క ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. శ‌నివారం ఉద‌యం నుంచి రికార్డులు, ప‌త్రాల‌ ప‌రిశీల‌న కొన‌సాగుతున్నట్లు విశ్వస‌నీయంగా తెలిసింది. ప్రధానంగా ఆదాయానికి మించిన ఆస్తుల‌పై ఆరా తీస్తుండ‌టం గ‌మ‌నార్హం. పెద్ద మొత్తంలోనే ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లుగా ఏసీబీ అధికారులు ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చినట్లుగా తెలుస్తోంది. 14 రోజుల పాటు రిమాండ్‌లో ఉండే రాజేంద్రనాథ్‌పై ప్రశ్నల వ‌ర్షం కుర‌వ‌నుంద‌ని తెలుస్తోంది.


Next Story

Most Viewed